Home » Ladakh
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నట్టు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు ఎల్జీ ఆమోదం తెలిపారు.
కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన రిటైర్డ్ కల్నల్ సోనం వాంగ్చుక్ శుక్రవారంనాడు లద్దాఖ్లోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 ఏళ్లు.
జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ సమీపంలో మంచు చరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది.
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ నిర్బంధాన్ని రద్దు చేస్తూ కేంద్రం శనివారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై గత ఏడాది సెప్టెంబర్ 26న వాంగ్చుక్ను నిర్బంధంలోకి తీసుకున్నారు.
పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుగ్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు బుధవారంనాడు ఆందోళన వ్యక్తం చేసింది. వాంగ్చుక్ నిర్బంధంపై పునఃసమీక్షించాలని కేంద్రానికి సూచించింది.
లద్దాఖ్లో హింసాత్మక ఘటనల అనంతరం జాతీయ భద్రతా చట్టం(NSA) కింద అరెస్టయిన వాంగ్చుక్ ప్రస్తుతం రాజస్థాన్లో జోథ్పూర్ జైలులో ఉన్నారు. వాంగ్చుక్ను ఆయన అన్నయ్య డోర్జీ లే, న్యాయవాది ముస్తఫా హజి కలుసుకున్నారు.
పాకిస్థాన్తో సంబంధాలున్నాయనే తప్పుడు ఆరోపణలతో తన భర్తను అరెస్టు చేసినట్టు గీతాంజలి ఆరోపించారు. జాతీయ భద్రతా చట్టం కింద తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
లెహ్లో సోమవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లెహ్ అపెక్స్ బాడీ చైర్మన్ తుప్స్తాన్ ఛెవాంగ్ మాట్లాడారు. లద్దాఖ్లో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అక్కడ శాంతియుత పరిస్థితి నెలకొనేంత వరకూ ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనరాదని తామంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్లో గతవారంలో లెహ్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వాంగ్చుక్ తన ప్రసంగాలతో హింసను రెచ్చగొట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆయన జోథ్పూర్ జైలులో ఉన్నారు.
వాంగ్చుక్ ఏళ్ల తరబడి శాంతియుత నిరసనలు తెలుపుతున్నారని, అయితే సీఆర్పీఎఫ్ చర్యలతోనే సెప్టెంబర్ 4న పరిస్థితి ఉద్రిక్తంగా మారి నలుగురి మృతికి దారితీసిందని ఆంగ్మో ఆరోపించారు.