Home » Ladakh
లడఖ్(Ladakh)కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్(Sonam Wangchuk) ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నిరాహార దీక్ష నేపథ్యంలో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఏప్రిల్ 7న పష్మీనా మార్చ్ ప్రకటించారు. దీని దృష్ట్యా లెహ్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో ఎప్పుడూ లేనంతగా వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆదివారం నాడు భారీ స్థాయిలో నిరసనలు చేపట్టారు. రక్తం గడ్డకట్టేంత చలి ఉన్నప్పటికీ.. దానిని ఏమాత్రం లెక్క చేయకుండా జనాలు ప్రదర్శనలు చేశారు. శనివారం.. అంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి.
భారత్- చైనా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద గత కొన్నాళ్ల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత పరిస్థితి మారింది. ఆ ప్రాంతంలో గొర్రెలను మోపేందుకు కాపారులు కూడా వెళ్లడం లేదు.
జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత తొలిసారి జరిగిన కార్గిల్ లోని లడఖ్ అటానమస్ హిల్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఓడించింది.
అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. మరోసారి మోదీని టార్గెట్ చేశారు. బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్...
భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్తున్నదంతా అబద్ధమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన భూమిని చైనా సైన్యం ఆక్రమించిందని చెప్పారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ లడఖ్ యాత్ర కొనసాగుతంది. సోమవారం ఆయన లడఖ్లోని కర్జుంగ్ లా పాస్ను సందర్శించారు. ఇది ప్రపంచంలోని ఎత్తైన మోటారు రోడ్డు మార్గాలలో ఒకటి.
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో శనివారం సాయంత్రం పెను విషాదం చోటుచేసుకుంది. ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు లోయలోకి జారిపడటంతో భారత ఆర్మీకి చెందిన తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
దేశంలోని అన్ని వ్యవస్థలనూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నడుపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అన్ని వ్యవస్థల్లోనూ తన మనుషులను ఏర్పాటు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లడఖ్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు కీర్తి, ప్రతిష్ఠలు రావడానికి కారణం ఆయన చేసిన కృషి అని, కేవలం పేరు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. న్యూఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం అని మార్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.